కంటిచూపును మెరుగుపరిచే చేపలతో పకోడీలు చేసేద్దామా?

ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలు

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:37 IST)
వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - రెండు కప్పులు
కోడిగుడ్లు -  మూడు
కార్న్‌ఫ్లోర్ - మూడు స్పూన్లు
కారం -  రెండు టీ స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు, నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారు చేసే విధానం :
ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. ఈ వేయించిన చేప ముక్కల్ని గ్రీన్ చట్నీతో వేపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేమొచ్చేస్తున్నాం ట్రంప్, ఇరాన్ పని పడదాం: నాటో దేశాలు కబురు

నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత

పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?

ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు

నితిన్ గడ్కరీ ముందు కూర్చున్న ఆర్కే రోజా.. వెనక నిలబడిన తనుజ.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని

సూర్య, RJ బాలాజీ కాంబినేషన్ చిత్రం కరుప్పు విడుదల తేదీ ప్రకటన

IIFTC అవార్డుల్లో గేమ్ ఛేంజర్, విశ్వం చిత్రాలకు పురస్కారాలు

Shiva Raj Kumar: గుమ్మడి నర్సయ్య నుంచి శివ రాజ్ కుమార్ ఫియర్స్ లుక్

Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్

తర్వాతి కథనం
Show comments