పండ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తాజా పండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి ఫ్రూట్ మిక్స్తో బ్రెడ్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం..
ముందుగా కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల పాలలో ఉండలు చుట్టకుండా కరిగించి పక్కనుంచుకోవాలి. మిగతా పాలలో పంచదార పొడి వేసి వేడిచేయాలి. పాలు మరుగుతుండగా కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి చిక్కబడనిచ్చి దించి రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు ఉంచాలి.
పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కస్టర్డ్ మిశ్రమాన్ని, వీటిని విడిగా ఫ్రిజ్లో ఉంచాలి. తినడానికి ముందు బౌల్లో కొంత కస్టర్డ్ మిశ్రమం వేసి పైన ఒక బ్రెడ్ స్లయిస్ను ఉంచి అది నానేలా పైన కమలారసం వేయాలి.మళ్లీ కస్టర్డ్ మిశ్రమాన్ని కొంత పోసి పైన తరిగిన పండ్ల ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.