శర్వానంద్ హీరోగా కమిలినీముఖర్జీ హీరోయిన్గా రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'గమ్యం'. యంగ్ స్టార్ శర్వానంద్ పాత్రకు తోడు 'గాలిశీను'గా అల్లరి నరేష్ పాత్ర ఈ చిత్రానికి హైలెట్గా నిలిచింది.
వైవిధ్యమైన కథా, కథనాలతో ఆఫ్బీట్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారన్న విషయాన్ని రుజువు చేస్తూ ఈ గమ్యం చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.