నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ను హీరోగా పరిచయం చేయాలనకున్న ఆలోచనను అల్లు అరవింద్ గండి కొట్టాడని గతంలో వార్తలు వచ్చాయి. ఏదో సాకు చెబుతూ... ఉండేవాడట. మెగా ఫ్యామిలీలో గొడవలకు ఇది కూడా ఓ కారణంగా గతంలో చెప్పుకున్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ బాధ్యతను పవన్కళ్యాణ్ చూసుకుంటున్నాడని తెలిసింది. ఆల్రెడీ సోదరి కుమారుడు ధర్మతేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. వైవిఎస్చౌదరి చిత్రం 'రేయ్'లో నటిస్తున్నాడు. దానికి ఫైనాన్స్ మెగా ఫ్యామిలీ ఇచ్చిందనే వార్తలు కూడా ఉన్నాయి.
అందుకే వరుణ్ను కూడా హీరోగా చేయాలనే చాలాకాలం నుంచి నాగబాబుకున్న కోరికను గ్రహించిన పవన్కళ్యాణ్ ఇక నుంచి వరుణ్ బాధ్యతను తనే తీసుకోనున్నట్లు తెలిసింది. దర్శకుడు రవిబాబుతో ఉషాకిరిణ్ మూవీస్లో చేయాల్సి ఉంది. కానీ వర్కవుట్ కాలేదు. తాజాగా గణేష్ బాబు నిర్మాతగా వరుణ్ తేజ్ను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పరిచయం చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.