నాగార్జునకి తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో ప్రేమ. తాను ఎంతటి బిజీగా వున్నా, ప్రతి రోజూ తండ్రి వద్దకు వచ్చి కాస్సేపు కబుర్లు చెప్పి వెళ్ళేవాడు. తాజాగా అక్కినేని ఫ్యామిలీ హీరోల త్రయం నటించిన 'మనం' విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా నాగార్జున తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు.
" మనం సినిమా ఫొటోలు తిరగేస్తుంటే ఈ ఫొటో కంటపడింది. నాన్నతో నేను దిగిన చివరి ఫోటో ఇది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఆయనతో నేను పంచుకున్నాను. ఏన్నార్ మన మధ్యనే ఉన్నారు. అని ట్వీట్ చేశారు. దాంతో, ఈ ఫొటో ఇప్పుడు నెట్లో బాగా హల్ చల్ చేస్తోంది.
నాగ చైతన్య, సమంత, శ్రియ నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. విక్రం కుమార్ దర్శకుడు. మే 23న సినిమా విడుదల అవుతుంది. త్వరలో పాటలను విడుదల చేయనున్నారు.