సూపర్స్టార్ మహేష్ కథానాయకుడిగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో జూలైలో ఓ భారీ చిత్రం ప్రారంభం అవుతుంది. ఓవర్సీస్లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ని విడుదల చేసిన సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్(తమ్ముడు), జ.హ.వీ.(మోహన్) ఈ ప్రెస్టీజియస్ మూవీస్ని నిర్మిస్తున్నారు. ఈ వార్తను అధికారికంగా సూపర్స్టార్ మహేష్, దర్శకులు కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు చెప్పారు.
ఈ చిత్రం గురించి సూపర్స్టార్ మహేష్ మాట్లాడుతూ - ''కొరటాల శివ చెప్పిన స్టోరీ ఎంతో ఎక్సైటింగ్గా వుంది. మా కాంబినేషన్లో ఇది మంచి కమర్షియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది'' అన్నారు.
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ - ''దర్శకుడిగా నా రెండో చిత్రమే సూపర్స్టార్ మహేష్బాబుతో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. మంచి అభిరుచి వున్న నిర్మాతలు నవీన్, రవిశంకర్(తమ్ముడు), జ.హ.వీ.ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ అవకుండా నిర్మించడానికి ప్లాన్ చేశారు. యూత్, ఫ్యామిలీస్, క్లాస్, మాస్ అందరినీ ఆకట్టుకునే అంశాలు ఈ కథలో వున్నాయి. యూనివర్సల్ అప్పీల్ వున్న ఈ సబ్జెక్ట్ మహేష్బాబుకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వుంటుంది. మహేష్బాబుగారి ఫ్యాన్స్ మెచ్చే అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఈ సినిమాలో మరెన్నో విశేషాలుంటాయి'' అన్నారు.
నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్(తమ్ముడు), జ.హ.వీ.(మోహన్) మాట్లాడుతూ - ''మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్స్టార్ మహేష్బాబుగారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం సూపర్స్టార్ మహేష్బాబుగారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేలా వుంటుంది'' అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణం అవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: మది, ఫైట్స్: అనల్ అరసు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి, రవిశంకర్(తమ్ముడు), జ.హ.వీ. (మోహన్), కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: కొరటాల శివ