వైవియస్ చౌదరి స్వీయదర్శకనిర్మాణంలో 'రేయ్' సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న మరో మోగా హీరో సాయిధరమ్ తేజ్. సయామీఖేర్, శ్రద్ధాదాస్ హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 9న విడుదలకు సిద్ధమవుతోంది.
ఆసక్తికరమైన విషయమేమంటే వెస్టిండీస్ భాషలోకి ఈ సినిమాని డబ్బింగ్ చేసి వెస్టిండీస్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత వైవియస్ చౌదరి మాట్లాడుతూ 'వెస్టిండీస్లో స్థిరపడిన తెలుగువారు చాలామంది ఉన్నారు. అలా స్థిరపడిన వారికి పుట్టిన తెలుగు యువకుడి కథే రేయ్.
భారత్ నుండి వెస్టిండీస్ వచ్చిన అమ్మాయితో కలిసి పాప్ సంగీతంలో ఒక బ్యాచ్గా తయారై అమెరికాలో జరుగుతున్న కాంపిటీషన్లో పాల్గొని టైటిల్ గెలవడం హీరో గోల్. సినిమా ఫస్టాఫ్ అంతా వెస్టిండీస్లో, సెకండాఫ్ అంతా అమెరికాలో చిత్ర కథ నడుస్తుంది' అని ఆయన తెలిపారు.