సుశాంత్‌ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ భారీ చిత్రం

Webdunia
మంగళవారం, 18 మార్చి 2014 (11:43 IST)
WD
కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన యూత్‌హీరో సుశాంత్‌ బర్త్‌డే మార్చి 18. ఈ సందర్భంగా సుశాంత్‌ నటించే కొత్త చిత్రం వివరాలు ప్రకటించారు. సుశాంత్‌ కథానాయకుడుగా రీసెంట్‌గా దైనికైనా రెడి వంటి హిట్‌ చిత్రాన్ని రూపొందించిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ అందించిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర అధినేత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ చిత్రం గురించి హీరో సుశాంత్‌ మాట్లాడుతూ - ''నా బర్త్‌డేకి ఈ న్యూస్‌ని ఓ స్పెషల్‌ గిఫ్ట్‌గా భావిస్తున్నాను. ఇంతవరకు శ్రీనాగ్‌ కార్పొరేషన్‌ బేనర్‌లోనే సినిమాలు చేసిన నేను బయటి బేనర్‌లో చెయ్యాలంటే ఓ పెద్ద బేనర్‌లో చెయ్యాలని వెయిట్‌ చేశాను. నేను వెయిట్‌ చేసినట్టుగానే అత్తారింటికి దారేది వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ తీసిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారి బేనర్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

అలాగే నాగేశ్వరరెడ్డిగారితో వర్క్‌ చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారు, నాగేశ్వరరెడ్డిగార్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌కి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''ఇది ఒక యూత్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. సుశాంత్‌ ఇప్పటివరకు లవ్‌ సినిమాలు చేశాడు. ఫస్ట్‌టైమ్‌ సుశాంత్‌లో వున్న ఆల్‌ యాంగిల్స్‌ని ప్రజెంట్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేసిన సబ్జెక్ట్‌ ఇది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్‌లో చేస్తున్న సినిమా ఇది. నాగేశ్వరరెడ్డితో సినిమా చేద్దామని చాలాకాలంగా అనుకుంటున్నాం. ఆయన చెప్పిన కథ సుశాంత్‌కి చాలా పర్‌ఫెక్ట్‌గా వుంటుందనిపించింది. కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాలతో చాలా మంచి పేరు సుశాంత్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం. ఏప్రిల్‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి'' అన్నారు. ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు... దిక్కుతోచని స్థితిలో భారతీయ యాత్రికులు

నా పనులన్నీ వదులుకుని వచ్చి తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు: తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు

తమిళనాడు డీఎంకే ఆర్కే రోజా మద్దతు.. స్టాలిన్‌ను ఆకాశానికెత్తేసింది.. బాబు ఏకిపారేసింది..

డ్రగ్స్ మత్తులో 9 యేళ్ళ బాలిక గొంతు కోసి చంపేసిన యువకుడు

Odisha Woman: పెళ్లి చేసుకుంటానని ఒకడు.. సాయం చేస్తానని మరొకడు.. యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

Show comments