మిల్కీ బ్యూటీ నోట మహేష్... మహేష్... మహేష్... నువ్వే దిక్కు!

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2013 (12:55 IST)
FILE
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ సినిమాలు చాలవన్నట్లు బాలీవుడ్‌కు జంప్ అయిన తమన్నా...ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతోంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి కెరీర్‌ను మలుచుకుంటున్న సమయంలో వున్నట్టుండి హిందీ సినిమా పరిశ్రమకు లగెత్తింది.

అయితే బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుందామనుకున్న ఈ మిల్కీబ్యూటీ అక్కడ చతికిల పడింది. 'హిమ్మత్ వాలా' చిత్రం ఫ్లాపైంది. కానీ తమన్నా గ్లామర్‌, పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో నెంబర్‌వన్ హీరోయిన్ అవకాశాన్ని మిస్ అయినందుకు తెగ బాధపడిపోతున్న ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌పై కన్నేసింది.

తెలుగులో నిలదొక్కుకోవాలంటే మహేశ్ బాబు ఒక్కడే తనకు దిక్కని భావించింది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన 'ఆగడు' చిత్రంలో కూడా తమన్నా ఎంపికైంది. గత కొంత కాలంగా తెలుగులో తమన్నాకు సరైన హిట్ లేదు. దీంతో సౌత్ చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కథ, హీరో, దర్శకుడు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. మహేష్ బాబు తప్ప ఎవరితోనూ వద్దంటున్న తమన్నా ఇప్పుడు మహేష్ నామ జపం చేస్తోంది. మహేష్ బాబుతో కలిసి ఒక్క హిట్టు కొడితే తన రేంజ్ మరింత పెరుగుతుందనేది తమన్నా ఆలోచన.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ మీదుగా వెళ్లేవాడిని, ఇండియా మార్పు వేగం ఆశ్చర్యపరుస్తోంది: సుందర్ పిచాయ్

రేపిస్ట్ కులవర్థన్ అంత్యక్రియలు పూర్తి.. చెత్త తొలగించే ఆటోలో మృతదేహం తరలింపు..

టీవీ సౌండ్ తగ్గించమని కోరిన భర్త.. దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన భార్య

నా అన్వేషణ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ బ్యాన్, అప్పుడు వినిసావు అన్నాడు, ఇప్పుడు చూసేందుకు అక్కడ ఏమీలేదు

రాజస్థాన్‌లో కలకలం ... రాహుల్ గాంధీని కాల్చిపడేస్తానన్న వ్యక్తి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

Show comments