రామ్ చరణ్ నటించిన తుఫాన్ ఆడియో మంగళవారంనాడు శిల్పకళావేదికలో జరుగబోతుంది. దీనికి ఇప్పటికే చిరు పర్యవేక్షణలో తన సిబ్బందిని నియమించాడు. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు అభిమానులకు, వచ్చేవారికి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇందులో శిల్పకళా సిబ్బందే కాకుండా తమ సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. దీనికోసం చర్చలు కూడా జరిగాయి. ఈ ఫంక్షన్కు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఎవరు వస్తారనేది క్లారిటీ లేదు. చిత్ర నిర్మాత, దర్శకులతోపాటు ప్రియాంకతో పాటు పలువురు వస్తారని తెలుస్తోంది. కాగా, ఈ వేడుకలో చిరు డాన్స్ వేస్తారేమోనని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.