నందమూరి బాలకృష్ణ ద్వితీయ కుమార్తె తేజస్విని వివాహం ఆగష్టు 21న జరుగుతున్న నేపధ్యంలో బాలయ్య ఫ్యాన్స్కు పిలుపునిచ్చాడు. అభిమానులంతా తరలి వచ్చి, తన కూతుర్ని ఆశీర్వదించాలని బాలకృష్ణ ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 21న జరిగే తన ద్వితీయ కుమార్తె తేజస్విని వివాహానికి అభిమానులందర్నీ ఆహ్వానిస్తూ ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎమ్వీయస్ మూర్తి మనవడు శ్రీ భరత్తో తేజస్విని వివాహం ఆగష్టు 21 ఉదయం హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో వైభవంగా జరుగనుంది. ప్రస్తుతం వివాహ ఏర్పాట్లలో బాలకృష్ణ బిజీగా వున్నారు.