మహేష్బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్లో రాబోయే చిత్రం గురించి ఇప్పటికే రంగం సిద్ధమయింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్పై అనిల్సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆగడు అని పేరు పెట్టారు. తమ బేనర్లో మంచి చిత్రమవుతుందని అనిల్సుంకర చెబుతున్నాడు.
తమన్నా కథానాయికగా నటించనున్న ఈ చిత్రం మహేష్బాబు బాడీలాంగ్వేజ్కు సరిపడా యాక్షన్ ఎంటర్టైనర్గా శ్రీనువైట్ల రూపొదించనున్నారు. థమన్ సంగీతం ఇప్పటికే రెండు ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఈ నెలాఖరులో మిగిలిన ట్యూన్స్ పూర్తిచేసి ఆగస్టులో సెట్పైకి వెళ్ళనున్నారు. హైదరాబాద్, బ్యాంకాక్, యూరప్లోకొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు.