సినీ నటుడు రామ్ చరణ్ - ఉపాసనల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా టెంపుల్ హౌస్ ఫామ్హౌస్లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు.
ఈ వివాహానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం, గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సినీ నటులు రజనీకాంత్, మోహన్బాబు, శ్రీదేవి బోనీకపూర్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, కోలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వివాహానికి వచ్చిన అతిథులను కాంగ్రెస్ ఎంపీ, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్, మేనల్లుడు అల్లు అర్జున్లు స్వయంగా ఆహ్వానం పలికారు.