లేటెస్ట్గా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎవడు'. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే జంజీర్ రీమేక్లో ముంబైలో షూటింగ్ పూర్తిచేసుకుని హైదరాబాద్ వచ్చాడు రామ్ చరణ్.
ఎవడు షూటింగ్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు. సమంతా కాంబినేషన్లో సాగే ఓ పాటను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోలో దీనికోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. దీనికి 70 లక్షలు ఖర్చు చేశారు. ఓ మాస్ సాంగ్ కోసం ఇంత ఖర్చు చేయాలా అన్న డౌట్ రావచ్చు.
ఈ చిత్రంతో పాటు మరో సినిమా దిల్రాజుది ఉంది. అది కూడా ఇక్కడే తీయనున్నారు. కాగా, ఇందులో శ్వేతా భరద్వాజ్ అనే హీరోయిన్తో ఐటం సాంగ్ కూడా చేశారు. దీన్నికూడా అన్నపూర్ణ ఏడెకరాల్లో చిత్రించారు.