ఉద్ధవ్ థాక్రే సీఎం పోస్టు ఊడిపోవడానికి హనుమంతుడు కారణమా?

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (18:47 IST)
ఉద్ధవ్ థాక్రే సీఎం పోస్టు పోవడానికి కారణం భజరంగభళీ హనుమంతుడు అంటూ మహారాష్ట్రలో కొందరు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం... ఉద్ధవ్ థాక్రే హనుమంతుడి హనుమాన్ చాలీసా పఠనం చేయకుండా అడ్డుకోవడమేనని అంటున్నారు. కాస్త వివరంగా చెప్పుకోవాలంటే...

 
సినీ నటి, భాజపా నాయకురాలు నవనీత్ కౌర్ 'మాతోశ్రీ' ముందు హనుమాన్ చాలీసా పఠించాలని పట్టుబట్టింది. అందుకు సీఎం థాక్రే తనకు, ఆమెకి కార్యకర్తలకు ఒక టెంట్ వేసి, టీ మరియు అల్పాహారం ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి ఇలా వుండేది కాదంటున్నారు. 

 
హునుమాన్ జయంతి సందర్భంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని లేకుంటే తామే సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్ రాణా, రవి రాణాలు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన అధికార శివసేన పార్టీ కార్యకర్తలు ఖార్‌లోని నవనీత్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత నవనీత్ కౌర్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 
మరోవైపు, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాలపై ఖార్ పోలీసులు నవనీత్ కౌర్ రాణా దంపతులపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రకరకాల మలుపులు చోటుచేసుకున్నాయి. శివసేనలోనే ముసలం పుట్టింది. రెండు గ్రూపులుగా విడిపోయాయి. విడిపోయిన గ్రూపుకి ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహించారు. ముఖ్యమంత్రి అవకాశం ఆయన్ని వరించింది. దీనంతటికీ కారణం... ఉద్ధవ్ థాక్రే హనుమాన్ చాలీసా పఠనం నిరోధించడమేనని మహారాష్ట్ర లోని ఓ వర్గం అంటుంది. మరి భజరంగభళి ఆ పని చేసారా...?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments