Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రైలు మిస్సయ్యిందా.. ఏం ఫర్వాలేదు...!

రైలు మిస్సయితే ఏం ఫర్వాలేదు అని చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? గతంలో రైలు మిస్సయ్యితే ఇక టిక్కెట్ డబ్బులు కాస్త గోవిందా.. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఒక మార్పును తీస

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (12:10 IST)
రైలు మిస్సయితే ఏం ఫర్వాలేదు అని చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? గతంలో రైలు మిస్సయ్యితే ఇక టిక్కెట్ డబ్బులు కాస్త గోవిందా.. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఒక మార్పును తీసుకొచ్చింది. అదేంటో చదవండి. 
 
ఇకపై అదే టికెట్‌తో అదే గమ్యానికి వెళ్ళే ఏ రైలైనా ఎక్కొచ్చు ఒకే గమ్యానికి వెళ్లే ఏ రైలులోనైనా సాధారణ టికెట్‌తో కూడా ప్రయాణించొచ్చని భారతీయ రైల్వే పేర్కొంది. 'వికల్ప్‌' పథకం ద్వారా పాసింజర్‌ లేదా ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణీకులు రైలు మిస్‌ అయితే తర్వాత అదే మార్గంలో అందుబాటులో ఉన్న ఏ రైలులోనైనా ప్రయాణించొచ్చని వెల్లడించింది. 
 
రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ, స్పెషల్‌ రైళ్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇలా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను వినియోగించుకున్నందుకు పాసింజర్ల నుంచి ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జీలు వసూలు చేయబోమని దక్షిణ మధ్య రైల్వే చెప్పింది. 
 
ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ప్రయాణీకులు ఆయా రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులను వినియోగించుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్‌ వెయిటింగ్‌ లిస్టులో ఉన్న పాసింజర్లు కూడా ఆ టికెట్లతో ఖాళీగా ఉన్న రైళ్లలో ప్రయాణించొచ్చని వివరించింది. 
 
ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలో 'వికల్ప్‌' స్కీంను ఎంచుకోవాలని చెప్పింది. దీంతో టికెట్లు వెయిటింగ్‌ లిస్టులో ఉంటే అదే సమయానికి ఖాళీగా ఉండే రైలు వివరాలు సదరు వ్యక్తి మొబైల్‌కు ముందుగానే వస్తాయని తెలిపింది. కాగా, ఫ్లెక్సీ ఫేర్‌ సిస్టంను ప్రారంభించిన తర్వాత ప్రీమియర్‌ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. 
 
రైల్వే తాజా నిర్ణయంతో లక్షలాది ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. మరింత సమాచారం కోసం కొన్ని నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments