Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి కోట్ల రూపాయల నగలు ఎవరికీ తెలియకుండా వచ్చి చేరాయట.. ఎలా?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (18:11 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో కనిపించకుండా పోయిన ఆభరణాలపై ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా చర్చ జరుగుతోంది. పటిష్ట బందోబస్తు ఉన్న ట్రెజరీ నుంచి శ్రీవారి ఆభరణాలను ఎలా మాయం చేశారు. ఎవరు ఎత్తుకెళ్ళారు. అసలు ట్రెజరీలో నగలు పోయిన రెండు సంవత్సరాల తరువాత ఈ విషయం బయటకు రావడం ఏంటి. ఇదే విషయంపై ఇప్పుడు అందరిలోను అనుమానాలు కలుగుతున్నాయి.
 
ట్రెజరీలో వెండి కిరీటం, బంగారు కిరీటాలు, హారం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 2017 సంవత్సరం ఈ వ్యవహారం జరిగితే అప్పట్లో టిటిడి ట్రెజరీలో ఎఈఓగా ఉన్న శ్రీనివాసరావు జీతం నుంచి మొత్తం డబ్బులను వసూలు చేయడం ప్రారంభించారు. ఇలా రెండేళ్ళు వసూలు చేశారు. ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు. 
 
అయితే కాలపరిమితి అయిపోతూ వస్తుండటంతో ఆ ఉద్యోగి బిజెపి నేతలను ఆశ్రయించాడు. తన జీతం మొత్తం టిటిడినే తీసేసుకుంటోందని చెప్పాడు. దీంతో ఆ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇదంతా జరుగుతుండగానే టిటిడిలో మరోసారి కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎఈఓ శ్రీనివాసులు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో ఆభరణాలు కనిపించకుండా పోతే అప్పట్లో ట్రెజరీలో ఉన్న మరికొన్ని ఆభరణాలను పరిశీలించారు.
 
అయితే కొత్త ఆభరణాలు బయటకు వచ్చాయి. దీంతో టిటిడి అధికారులు ఆశ్చర్యపోయారు. ఉండాల్సిన ఆభరణాలు లేకుండా కొత్త ఆభరణాలు ఎలా వచ్చాయో అస్సలు టిటిడి అధికారులకు అర్థం కాలేదట. అయితే వాటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారంటూ వాదనలు వస్తున్నాయి. అయితే ఈ నగలు ఎలా వచ్చాయో తెలియక జుట్టు పీక్కుంటున్నారు టిటిడి ట్రెజరీ సిబ్బంది. తమకు తెలియకుండా, రిజిస్ట్రర్లో రాయకుండా నగలు ఎలా చేరాయోనని ఆలోచనలో పడిపోయారు. ఇదేమైనా కలియుగ దైవం లీలేమో చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments