Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి కోట్ల రూపాయల నగలు ఎవరికీ తెలియకుండా వచ్చి చేరాయట.. ఎలా?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (18:11 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో కనిపించకుండా పోయిన ఆభరణాలపై ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా చర్చ జరుగుతోంది. పటిష్ట బందోబస్తు ఉన్న ట్రెజరీ నుంచి శ్రీవారి ఆభరణాలను ఎలా మాయం చేశారు. ఎవరు ఎత్తుకెళ్ళారు. అసలు ట్రెజరీలో నగలు పోయిన రెండు సంవత్సరాల తరువాత ఈ విషయం బయటకు రావడం ఏంటి. ఇదే విషయంపై ఇప్పుడు అందరిలోను అనుమానాలు కలుగుతున్నాయి.
 
ట్రెజరీలో వెండి కిరీటం, బంగారు కిరీటాలు, హారం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 2017 సంవత్సరం ఈ వ్యవహారం జరిగితే అప్పట్లో టిటిడి ట్రెజరీలో ఎఈఓగా ఉన్న శ్రీనివాసరావు జీతం నుంచి మొత్తం డబ్బులను వసూలు చేయడం ప్రారంభించారు. ఇలా రెండేళ్ళు వసూలు చేశారు. ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు. 
 
అయితే కాలపరిమితి అయిపోతూ వస్తుండటంతో ఆ ఉద్యోగి బిజెపి నేతలను ఆశ్రయించాడు. తన జీతం మొత్తం టిటిడినే తీసేసుకుంటోందని చెప్పాడు. దీంతో ఆ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇదంతా జరుగుతుండగానే టిటిడిలో మరోసారి కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎఈఓ శ్రీనివాసులు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో ఆభరణాలు కనిపించకుండా పోతే అప్పట్లో ట్రెజరీలో ఉన్న మరికొన్ని ఆభరణాలను పరిశీలించారు.
 
అయితే కొత్త ఆభరణాలు బయటకు వచ్చాయి. దీంతో టిటిడి అధికారులు ఆశ్చర్యపోయారు. ఉండాల్సిన ఆభరణాలు లేకుండా కొత్త ఆభరణాలు ఎలా వచ్చాయో అస్సలు టిటిడి అధికారులకు అర్థం కాలేదట. అయితే వాటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారంటూ వాదనలు వస్తున్నాయి. అయితే ఈ నగలు ఎలా వచ్చాయో తెలియక జుట్టు పీక్కుంటున్నారు టిటిడి ట్రెజరీ సిబ్బంది. తమకు తెలియకుండా, రిజిస్ట్రర్లో రాయకుండా నగలు ఎలా చేరాయోనని ఆలోచనలో పడిపోయారు. ఇదేమైనా కలియుగ దైవం లీలేమో చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments