సీనియర్లతో చెలగాటమా? మోదీకి దిమ్మతిరిగింది.. అద్వానీతో భేటీ ఎప్పుడు?

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఖంగుతింది. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకత మొదలైందని.. మోదీ హవాకు బ్రేక్ పడుతోందని కర్ణాటక ఎన్నికలే చెప్పేశాయని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం,

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (10:56 IST)
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఖంగుతింది. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకత మొదలైందని.. మోదీ హవాకు బ్రేక్ పడుతోందని కర్ణాటక ఎన్నికలే చెప్పేశాయని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం, బీజేపీ తీరును శివసేన పార్టీ తూర్పారబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్న బీజేపీ కొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.
 
ఇందులో భాగంగా సీనియర్ నేతలను మళ్లీ రంగంలోకి దించాలని భావిస్తోంది. 75 ఏళ్లకు పైబడిన వారిని ఎన్నికలకు, పదవులకు దూరంగా ఉంచాలని బీజేపీ అధిష్ఠానం గతంలో భావించింది. ఈ నిబంధనను బీజేపీ పక్కనబెట్టి సీనియర్లను రంగంలోకి దించాలని ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషిలను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 
 
అప్పుడే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమవుతుందని.. లేకుంటే బీజేపీ 2019 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎల్ కే అద్వానీ తిరిగి పోటీ చేస్తే బాగుంటుందని మోదీ అభిప్రాయపడుతున్నారని మీడియా కూడా కోడైకూస్తోంది.

ఈ విషయమై చర్చించేందుకు అద్వానీని మోదీ కలుస్తారని తెలుస్తోంది. మిగిలిన సీనియర్లతో కూడా చర్చలు జరిపేందుకు బీజేపీ నేతలు సంసిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments