Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ని అలా టార్గెట్ చేయమని పిలుపునిచ్చిన జనసేనాని..?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:11 IST)
100 రోజులు. కొత్త ప్రభుత్వం. ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసింది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. అస్తవ్యస్థ పాలన. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేయండి..జనసైనికులను సిద్థం చేయండి.. అంటూ పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
 
అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పూర్తిస్థాయిలో తెలియని ముఖ్యమంత్రి జగన్. కనీసం అనుభవం ఉన్న వారినైనా తెలుసుకుని పరిపాలన చేయాలి. అదీ చేయడం లేదు. ఇక ఉపేక్షించొద్దు. మన టార్గెట్ జగన్. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడండి. ప్రజల్లో చైతన్యం తీసుకురండి..అయితే మన పర్యటనలో జనసమీకరణలు అవసరం లేదు. 
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మనము వెళుతున్నాం. ఆర్భాటం మనకు అస్సలు అవసరం లేదు. త్వరలో ఎపిలోని 175స్థానాల్లో నేను పర్యటిస్తాను. ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటాను. రైతులు, నిరుపేదలు పడుతున్న కష్టాలు నా దృష్టికి వచ్చాయి. వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతామంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసైనికులు పోరాటానికి సిద్థం చేయాలని పార్టీ శ్రేణులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments