సీఎం జగన్‌ని అలా టార్గెట్ చేయమని పిలుపునిచ్చిన జనసేనాని..?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:11 IST)
100 రోజులు. కొత్త ప్రభుత్వం. ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసింది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. అస్తవ్యస్థ పాలన. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేయండి..జనసైనికులను సిద్థం చేయండి.. అంటూ పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
 
అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పూర్తిస్థాయిలో తెలియని ముఖ్యమంత్రి జగన్. కనీసం అనుభవం ఉన్న వారినైనా తెలుసుకుని పరిపాలన చేయాలి. అదీ చేయడం లేదు. ఇక ఉపేక్షించొద్దు. మన టార్గెట్ జగన్. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడండి. ప్రజల్లో చైతన్యం తీసుకురండి..అయితే మన పర్యటనలో జనసమీకరణలు అవసరం లేదు. 
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మనము వెళుతున్నాం. ఆర్భాటం మనకు అస్సలు అవసరం లేదు. త్వరలో ఎపిలోని 175స్థానాల్లో నేను పర్యటిస్తాను. ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటాను. రైతులు, నిరుపేదలు పడుతున్న కష్టాలు నా దృష్టికి వచ్చాయి. వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతామంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసైనికులు పోరాటానికి సిద్థం చేయాలని పార్టీ శ్రేణులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments