Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ చనిపోయారా.. కర్మకాండలు జరిపించొద్దు.. గాంధీ :: అస్థికలు భారత్‌కు తేవొద్దు... పీవీ

Webdunia
ఆదివారం, 24 జనవరి 2016 (16:17 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నేతాజీ రహస్య పత్రాల్లో ఒక్కో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా నేతాజీ మరణించిన విషయాన్ని మహాత్మా గాంధీ ఏమాత్రం నమ్మలేదట. అందుకే నేతాజీకి కర్మకాండలు జరిపించవద్దని కోరినట్టు ఈ రహస్య దస్త్రాల్లో ఉంది. 
 
నేతాజీ మరణ వార్త గురించి, ఆయనతో విమానంలో ప్రయాణించిన హబీబుర్ రెహమాన్, మహాత్మా గాంధీకి చెప్పిన వేళ, ఆయన ఆ విషయాన్ని నమ్మలేదు. "సుభాష్ విమాన ప్రమాదంలో మరణించాడంటే నేను నమ్మను. ఆయన కర్మకాండలు జరిపించవద్దు" అని గాంధీ వ్యాఖ్యానించినట్టు బోస్ కుమారుడు అమియా నాథ్ బోస్ తెలిపినట్టు ఉన్న ఓ ఫైల్ వెలుగులోకి వచ్చింది.
 
దీని గురించి 1995లో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో బోస్ అస్థికలను ఏం చేయాలని కోరుతూ జపాన్ నుంచి లేఖ రాగా, దానిపై చర్చించిన పీవీ మంత్రివర్గం వాటిని భారత్‌కు తీసుకురాకూడదని అభిప్రాయపడింది. వాటిని తీసుకువస్తే, ఆయన బతికున్నట్టు నమ్ముతున్న బెంగాల్ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, పైగా ఏ వర్గం నుంచి కూడా ఆయన అస్థికలని తీసుకురావాలని డిమాండ్ రావడం లేదని పీవీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 'నేతాజీ యాషెస్ ఇన్ టోక్యో' పేరిట ఉన్న నోట్ ఫైల్ విడుదలైంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments