ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు

ఐవీఆర్
గురువారం, 12 డిశెంబరు 2024 (15:36 IST)
ఉత్తరాంధ్ర వైసిపి కుండకు చిన్నగా చిల్లు పడుతోంది. కీలక నాయకులు క్రమంగా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఈ వరుసలో ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేరిపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా జగన్ మోహన్ రెడ్డి తొందరపడుతున్నారని, ఐదేళ్లపాటు వారి పాలనను చూసాక మనం కాదు ప్రజలే తీర్పు ఇస్తారని అవంతి అంటున్నారు. పైగా కార్యకర్తలను ఒత్తిడి చేసి ముందుకు తోస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క కార్యకర్తకి FB, YouTube, Twitter ఖాతాలు వుండాలనీ, దాని ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటూ జగన్ పిలుపునిచ్చారు.
 
ఐతే జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు నలిగిపోతున్నారని అవంతి అంటున్నారు. సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టండి... ప్రభుత్వం కేసులు పెడితే మన లాయర్లు చూసుకుంటారు అని అనడం ఎంతవరకు సబబు. కార్యకర్తలపై కేసులు పెడితే అది ఊరకనే పోతుందా... స్టేషన్లు చుట్టూ వాళ్లవాళ్ల కుటుంబాలను వదిలేసి తిరగాలా.. ఇదెక్కడి న్యాయం. రాష్ట్రం ఆర్థికంగా చాలా చితికిపోయి వున్నదని మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వరా?
 
 
ఇదిలావుంటే.. జగన్ నిర్ణయంతో ఇంకా చాలామంది నాయకులు జంప్ అయ్యే అవకాశం వుందని ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు అంటున్నారు. ఇదే జరిగితే... జగన్ చేపట్టే ఆందోళన కార్యక్రమం ప్రారంభం కాకముందే వైసిపి కుండకి పడిన చిల్లు మరికాస్త పెద్దదయ్యే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments