Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు

ఐవీఆర్
గురువారం, 12 డిశెంబరు 2024 (15:36 IST)
ఉత్తరాంధ్ర వైసిపి కుండకు చిన్నగా చిల్లు పడుతోంది. కీలక నాయకులు క్రమంగా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఈ వరుసలో ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేరిపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా జగన్ మోహన్ రెడ్డి తొందరపడుతున్నారని, ఐదేళ్లపాటు వారి పాలనను చూసాక మనం కాదు ప్రజలే తీర్పు ఇస్తారని అవంతి అంటున్నారు. పైగా కార్యకర్తలను ఒత్తిడి చేసి ముందుకు తోస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క కార్యకర్తకి FB, YouTube, Twitter ఖాతాలు వుండాలనీ, దాని ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటూ జగన్ పిలుపునిచ్చారు.
 
ఐతే జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు నలిగిపోతున్నారని అవంతి అంటున్నారు. సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టండి... ప్రభుత్వం కేసులు పెడితే మన లాయర్లు చూసుకుంటారు అని అనడం ఎంతవరకు సబబు. కార్యకర్తలపై కేసులు పెడితే అది ఊరకనే పోతుందా... స్టేషన్లు చుట్టూ వాళ్లవాళ్ల కుటుంబాలను వదిలేసి తిరగాలా.. ఇదెక్కడి న్యాయం. రాష్ట్రం ఆర్థికంగా చాలా చితికిపోయి వున్నదని మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వరా?
 
 
ఇదిలావుంటే.. జగన్ నిర్ణయంతో ఇంకా చాలామంది నాయకులు జంప్ అయ్యే అవకాశం వుందని ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు అంటున్నారు. ఇదే జరిగితే... జగన్ చేపట్టే ఆందోళన కార్యక్రమం ప్రారంభం కాకముందే వైసిపి కుండకి పడిన చిల్లు మరికాస్త పెద్దదయ్యే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments