Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో మెగా ఫ్యామిలీ.. పవన్ కోసం చిరంజీవి, బన్నీ, చెర్రీ?

సెల్వి
శనివారం, 27 ఏప్రియల్ 2024 (19:49 IST)
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వంటి వారు ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గమైన పిఠాపురంలో పవర్‌స్టార్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు.
 
2019 ఎన్నికల్లో పవన్ ఓడిపోయినందున, ఈసారి, నటుడు-రాజకీయనాయకుడి మద్దతుదారులు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. శనివారం మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ తన ‘బాబాయ్’ నియోజక వర్గంలో ప్రచారం చేసేందుకు పిఠాపురం వరకు వెళ్లారు.
 
అయితే పవన్ కోసం మెగా ఫ్యామిలీ ప్రచార బరిలోకి దిగనుందని టాక్ వస్తోంది. పవన్ ప్రచారానికి మెగాస్టార్ చిరు రావడం ఖాయం అయితే, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు కూడా రావచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనాని కోసం చెర్రీ, బన్నీ ప్రచారం చేసేందుకు సిద్ధంగా వున్నారని టాక్ వస్తోంది. 
 
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని, దానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందని, రామ్ చరణ్ నియోజకవర్గంలో ఒకట్రెండు రోజుల పాటు ఇంటింటికీ ప్రచారానికి వెళ్లవచ్చని కొందరు అంటున్నారు. 
Allu arjun-berlin
 
ఇంతకుముందు అల్లు అర్జున్ పవన్ మీటింగ్‌కి వెళ్లడం చూశాం. అయితే చరణ్ తన బాబాయ్ కోసం ఎన్నికలలో వెళ్ళలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments