Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహదారి సమీపంలో నగ్నంగా యువతి-యువకుడి శవాలు: మర్మాంగం ఛిద్రం చేసారు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (19:23 IST)
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ యువకుడు, ఓ యువతి శవాలు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో నగ్నంగా పడి వున్నాయి. వారి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హత్యకు కారణం వివాహేతర సంబంధం అని ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. ఇద్దరి శవాల పక్కనే ఓ బ్యాగు వుండటంతో దాని ఆధారంగా మృతుల వివరాలను కనుగొన్నారు. వీరిద్దరూ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని వారాసిగూడకు చెందిన 22 ఏళ్ల యశ్వంత్, 28 ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. యువకుడి మర్మాంగం ఛిద్రం చేసినట్లు గాయాలను బట్టి తెలుస్తుంది. మృతురాలు జ్యోతి తలపై బండరాయితో మోది చంపేసారు.

 
కాగా ఆదివారం సాయంత్రం యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతడి సోదరుడు తెలిపాడు. ఐతే జ్యోతి ఎవరో తమకు తెలియదన్నారు. మృతురాలు జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నట్లు తేలింది. ఐతే ఈ హత్యలు చేసింది ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments