Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం కోసం వెళుతూ మహిళను చంపేసిన దొంగలు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జులై 2023 (12:43 IST)
ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం కోసం బయలుదేరిన ఇద్దరు దొంగలు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను దారుణం హత్య చేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను చితకబాది.. ఆ ఆటోలో పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాకినాడ జిల్లా తుని మండలం, ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై సత్యవతి అనే మహిళ ఒక ఆటోలో ప్రయాణిస్తుంది. అప్పటికే అక్కడకు చేరుకుని మాటు వేసిన ఇద్దరు దొంగలు సడెన్‌గా అడ్డుకుని ఆటోని ఆపారు. ఆపై డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తులైన దొంగలు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. 
 
ఆ తర్వాత ఆటో డ్రైవర్‌పై దాడి చేసి, ఆ ఆటోలోనే పారిపోయారు. తీవ్రగాయాలైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు గుర్తించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఆటో డ్రైవర్‌ నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తుంది. ఈ హత్య వెనుక ఏదైనా కుట్ర దాగివుందా? ఆటో డ్రైవర్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments