Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ.. బైకుపై దింపుతామని నమ్మించి....

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (12:18 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యాచారానికిగురైంది. తార్నాక బస్టాపులో అర్థరాత్రిపూట బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను కొందరు కామాంధులు మాటలు కలిపి.. బైకుపై దింపుతామని నమ్మించారు. ఆ తర్వాత తమ బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన ఈ నల 7వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 7వ తేదీన తార్నాకలోని ఓ మహిళ బస్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఆ సమయంలో బైకుపై అటుగా వెళుతున్న బర్న యేసు (32) అనే వ్యక్తి ఆమెను గమనించాడు. ఆ తర్వాత ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపి, తాను బైకుపై తీసుకెళ్లి దింపుతానని నమ్మించాడు. యేసు మాటలు నమ్మిన ఆ మహిళ అతనితో బైకుపై వెళ్లగా, ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం. ఆ తర్వాత తన స్నేహితులకు కూడా సమాచారం చేరవేయడంతో వారు కూడా అక్కడకు వచ్చి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. పిమ్మట బాధితురాలిని తీసుకొచ్చి మళ్లీ తార్నాక బస్టాండులోనే వదిలిపెట్టారు. ఎనిమిదో తేదీ నుంచి మౌనంగా ఉంటూ వచ్చిన ఆ మహిళ... చివరకు లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తార్నాక బస్టాప్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందిడైన బర్న యేసుతో పాటు మధుయాదవ్ (31), ప్రశాంత్ (20), తరుణ్ (20), రోహిత్ (19)లను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments