Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చావబాది... భార్యను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (11:56 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యాభర్తలను అడ్డగించిన కొందరు దుండగులు... భర్తపై దాడి చేసి బంధించారు. అతని భార్యను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఈ నెల 21వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒరిస్సా రాష్ట్రంలోని జాజిపుర్ జిల్లాకు చెందిన ఓ మహిళ చదువుకునేందుకు బారునా ప్రాంతంలో ఉంటున్నారు. ఆమెను తీసుకెళ్లేందుకు జాజుర నుంచి భర్త వచ్చాడు. ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ఓ వాగు సమీపంలో వారిని ఐదుగురు దుండగులు అడ్డగించారు. భర్తపై దాడి చేసి.. మొబైల్, బైక్ తాళాలు లాక్కున్నారు. 
 
అతడిని చావగొట్టి.. భార్యను సమీపంలోని అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భూబన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాచారం రుజువైనట్లు తేలితే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అత్యాచారం జరిగినట్లు తేలిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments