తరగతి గదిలో తాళి కట్టాడు.. పెళ్లయిందంటూ అత్యాచారం చేశాడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:03 IST)
తన వద్ద చదువుకునే పదో తరగతి చదువుకునే బాలికను ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. తరగతి గదిలోనే తాళి కట్టాడు. ఆ తర్వాత పెళ్లయిపోయిందంటూ అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
భీమవరం గ్రామీణం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమవరాజు అనే వ్యక్తి జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రేమిస్తున్నారనని, పెళ్లి చేసుకుంటామని చెప్పి అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని ఈ నెల 19వ తేదీన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లారు. 
 
అక్కడే తాళి కట్టి పెళ్లయిందని చెప్పారు. ఆపై అత్యాచారనికి పాల్పడ్డారు. ఈ మేరకు బుధవారం బాధతురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, పోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments