Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో తాళి కట్టాడు.. పెళ్లయిందంటూ అత్యాచారం చేశాడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:03 IST)
తన వద్ద చదువుకునే పదో తరగతి చదువుకునే బాలికను ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. తరగతి గదిలోనే తాళి కట్టాడు. ఆ తర్వాత పెళ్లయిపోయిందంటూ అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
భీమవరం గ్రామీణం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమవరాజు అనే వ్యక్తి జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రేమిస్తున్నారనని, పెళ్లి చేసుకుంటామని చెప్పి అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని ఈ నెల 19వ తేదీన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లారు. 
 
అక్కడే తాళి కట్టి పెళ్లయిందని చెప్పారు. ఆపై అత్యాచారనికి పాల్పడ్డారు. ఈ మేరకు బుధవారం బాధతురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, పోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments