Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్‌ను హత్య చేసిన భార్య.. అన్యోన్య దాంపత్యమని నమ్మించేందుకు ప్రయత్నించి...

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (09:28 IST)
విశాఖపట్టణంలో ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్య చేతిలోనే హతమయ్యాడు. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితురాలు అతి చేసి పోలీసుల చేతికి చిక్కింది. తమది అన్యోన్య దాంపత్యమని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా బుక్కైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల విశాఖపట్టణానికి చెందిన రమేశ్ అనే ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య శివజ్యోతి.. అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. ఆ తర్వాత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పడిన తాపత్రయే పలు అనుమానాలకు దారితీసింది.
 
భర్త హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే అతడితో ప్రేమగా ఉన్నట్టు నిందితురాలు కొన్ని వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మద్యం మత్తులో తూలిపోతున్న రమేశ్‌ను మంచంపై పడుకోబెట్టడం, భార్య మంచిదని అతడు వీడియోలో చెప్పడం వంటి దృశ్యాలను ఆమె చాకచక్యంగా రికార్డు చేసంది. హత్య అనంతరం విచారణకు వచ్చిన పోలీసులకు శివజ్యోతి ఈ వీడియోలను కూడా చూపించి, తమది అన్యోన్య దాంపత్యమని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.
 
దీంతో ఆమెను అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఆమె ఇదంతా చేసి ఉంటుందని అనుమానించిన పోలీసులు చివరకు వాస్తవాన్ని వెలికి తీశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న శివజ్యోతి, ఏ2గా ఉన్న ఆమె ప్రియుడు, ఏ3 అయిన వెల్డర్ నీలాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments