Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఐతో ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించిన విద్యార్థులు...

ఠాగూర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (11:38 IST)
అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీని విద్యార్థులు వక్రమార్గంలో వినియోగిస్తున్నారు. తాజాగా యూపీకి చెందిన కొందరు విద్యార్థులు కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో తమకు పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని మొరాదాబాద్ లోని ఓ ప్రతిష్టాత్మక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో వారి ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా రూపొందించి సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్)లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా మరికొందరు విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇలాంటి ఫోటోలు రూపొందించి వాటినీ వైరల్ చేస్తామని బెదిరించారు. ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ జరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధిత ఉపాధ్యాయురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. 
 
దీనిపై ఆమె సివిల్ లైన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్.ఓ.మనీష్ సక్సేనా తెలిపారు. సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అలానే ఇన్‌స్టా నుండి బాధిత ఉపాధ్యాయురాలి ఫోటోల తొలగింపునకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments