Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (12:12 IST)
బంధువుల ఇంటికి వెళ్లి వద్దామని నమ్మించి భార్యాపిల్లలిద్దరిని బైకుపై ఎక్కించుకుని ఓ బావి వద్దకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. ఆ ముగ్గురుని బావిలో తోసేశాడు. ఆ తర్వాత గొంతుకోసుకుని తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మద్దినాయనిపల్లె పంచాయతీ పెద్దూరు హరిజన వాడకు చెందిన టి.గిరి (37), హేమంత కుమారి (35) భార్యాభర్తలు. వీరికి తనుశ్రీ (11), తేజశ్రీ (8) కుమార్తెలు. తిరుపతిలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చారు. గురువారం మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లివద్దామంటూ స్కూటరుపై భార్యా పిల్లలను తీసుకుని కొనే బోయిన ఇండ్లు రింగురోడ్డు సమీ పంలో బావి దగ్గరికి తీసుకెళ్లి అందులోకి వారిని తోసేశాడు. 
 
ఆ తర్వాత భార్య చిన్నకుమార్తె మృతదేహాలను గట్టుకు లాగాడు. అంతలో సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న కొందరు గమనించడంతో చాకుతో గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి గిరిని ఆస్పత్రికి తరలించారు. తనుశ్రీ మృతదేహాన్ని అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సాయంతో వెలికి తీశారు. సీఐ సుదర్శన ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments