పనీపాట లేదు, నీకు పిల్లనెవరు ఇస్తార్రా అన్నందుకు తండ్రిని, చిన్నాన్నను హత్య చేసాడు

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (22:07 IST)
ఈరోజుల్లో అబ్బాయిలకు పెళ్లి కావడం అంటే మామూలు విషయం కాదు. అందునా పనిపాట లేకుండా ఆవారాగా తిరిగే వారికి పిల్లను ఎవరిస్తారు? ఇదే మాట ఆ యువకుడి తండ్రి, పినతండ్రి అన్నారు. అంతే... ఇద్దరినీ అత్యంత కిరాతకంగా హత్య చేసాడు ఆ యువకుడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామంలో 30 ఏళ్ల నితీష్ పనీపాట లేకుండా ఆవారా తిరుగుతున్నాడు. ఐతే తనకు పెళ్లి చేయాలంటూ తండ్రిపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నాడు. ఈ నేపధ్యంలో కుమారుడితో... నీవేమీ పనీపాట చేయడంలేదు. ఎవర్ని అడిగినా అదే మాట అంటున్నారు. నీకు పిల్లని ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అంటున్నారు. 

 
నీవేమీ చేయడంలేదు, పిల్లనెవరు ఇస్తారని అన్నాడు కన్నతండ్రి. అతడి మాటలతో తమ్ముడు కూడా వత్తాసు పలికాడు. అంతే... కోపంతో ఊగిపోతూ విచక్షణ కోల్పోయిన సతీష్.. తన తండ్రితో పాటు పినతండ్రిని అతి దారుణంగా హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments