Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఐవీఆర్
శనివారం, 27 ఏప్రియల్ 2024 (12:51 IST)
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. తన భర్త వేరే మహిళతో బెడ్రూంలో ఏకాంతంగా వుండటాన్ని చూసిన భార్య వారిద్దరి గదికి తాళం వేసేసింది. దీనితో భయపడిన ఆ జంట ఆ గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
 
పోలీసులు చెప్పిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జనగాం జిల్లా రాజపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్ గతకొంతకాలంగా బచ్చన్నపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వాళ్లద్దరూ బెడ్రూంలో ఏకాంతంగా గడుపుతున్నారు.
 
ఆ సమయంలో వచ్చిన భార్య తన భర్త వేరే మహిళతో వుండటాన్ని చూసి ఆ గదికి గడియపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. దీనితో భయపడిపోయిన ఇద్దరూ తమ పరువు పోతుందని బెడ్రూంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూస్తే ఇద్దరూ విగతజీవులై వున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments