Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టారు.. బొందపెట్టిన స్థలంపైనే పొయ్యిపెట్టి పిండివంటలు చేశారు..

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ తండాలో దారుణం జరిగింది. అత్తమామలు, ఆడపడుచు కలిసి ఇంటి కోడలిని చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. ఆపై బొందపెట్టిన స్థలంపైనే పొయ్యి పెట్టి పిండివంటలు చేసుకున్న అమానవీయ సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ తండాలోని భూపతి అంజయ్య ఇంటిలో గత కొన్ని నెలలుగా కాటి గోపి అతని భార్య నాగమణి, తల్లిదండ్రులు లక్ష్మి, రాములు, ఆడపడుచు దుర్గ, బావ మహేందర్‌తో కలిసి ఉంటున్నాడు. కాటిగోపి నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. కూలీ పనులతో పాటు యాచక వృత్తిలో ఉన్నారు. నాగమణిని కొన్ని నెలలుగా భర్త గోపి వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. 
 
ఈ క్రమంలోనే భర్త గోపి తల్లిదండ్రులు, ఆడపడుచు, బావతో కలిసి భార్యను ఈనెల 13న హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య అనంతరం ఇంటి ఆవరణలోనే నాగమణి మృతదేహాన్ని బొందపెట్టి ఆ రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా పరారయ్యారు. ఈ నెల 13న ఇంటి నుంచి అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు ఇంటి ఓనర్ భూపతి అంజయ్యకు ఫిర్యాదు చేశారు. 
 
శుక్రవారం అంజయ్య ఇంటి వద్దకు చేరుకుని పరిశీలిస్తుండగా గోతి తీసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులతో కలిసి పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబాబాద్ పట్టణ పోలీసులు క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. నాగమణిని హత్య చేసి ఇంటి పక్కనే పూడ్చివేసి.. బొందపెట్టిన స్థలంలోనే పొయ్యి ఏర్పాటు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాగమణి హత్యకు కారణాలేంటి..? ఎన్ని రోజుల క్రితం హత్య జరిగింది ? ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు? అనే విషయాలను కనుగోనేందుకు పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments