Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిడ్జిలో శవం, అందుకే పెట్టానని చెపుతున్న యువకుడు

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (17:48 IST)
వరంగల్ జిల్లా పరకాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వృద్ధుడు శవాన్ని ఫ్రిడ్జిలో పెట్టాడు అతడి మనవడు. ఆ వృద్ధుడిని హత్య చేసి పెట్టాడా లేక చనిపోయిన తర్వాత పెట్టాడా అన్నది తేలాల్సి వుంది.
 
వివరాలు చూస్తే... కామారెడ్డి జిల్లాకు చెందిన 90 ఏళ్ల బాలయ్య రిటైర్డ్ లెక్చరర్. ఈయన భార్య, కుమారుడు, కోడలు అంతా పలు కారణాల వల్ల చనిపోయారు. దీనితో 25 ఏళ్ల తన మనవడితో వుంటున్నాడు. ఇంట్లో 3 నెలల క్రితమే బాలయ్య భార్య కరోనాతో కన్నుమూసింది. ఇక అప్పట్నుంచి బాలయ్య దిగులు చెందుతూ వున్నాడు.
 
కొడుకు, కోడలు, భార్య అంతా చనిపోయారు, ఒక్కగానొక్క మనవడి బాగోగులు ఎవరు చూసుకుంటారా అని ఆవేదన చెందేవాడు. ఐతే ఉన్నట్లుండి 15 రోజులుగా బాలయ్య కనిపించడంలేదు. తాత ఏమయ్యాడని మనవడు నిఖిల్ ను అడిగితే... పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
 
ఇంతలో వారు నివాసం వుంటున్న ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు విషయాన్ని ఇంటి యజమానికి చేరవేసారు. అతడు వచ్చి చూడగా ఫ్రిడ్జ్ నుంచి భరించలేని దుర్వాసన వస్తున్నట్లు గమనించి దాని తలుపులు తీయగా అందులో కుళ్లిపోయిన స్థితిలో వృద్ధుడి శవం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి అంతా షాక్ తిన్నారు.
 
తన తాతయ్య చనిపోవడంతో తనకు ఎవరూ లేకపోవడం కారణంగా ఏం చేయాలో తెలియక అలా ఆయన శవాన్ని ఫ్రిడ్జిలో పెట్టానంటూ నిఖిల్ చెపుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments