Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదిన - మరిది మధ్య వివాహేతర సంబంధం : చివరకు...

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (10:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా దేవరకద్రలో వదిన, మరిది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిద్దిర మధ్య ఉన్న వివాహేతర బంధమే వారి ప్రాణాలను తీసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలమూరు జిల్లా దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య అర్చన (23) తన భర్త కుటుంబంలో వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
అయితే ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఒకే చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యంలోనే అర్చన మృతి చెందింది. మరోవైపు మధు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments