Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో దారుణ హత్య - కారులో మృతదేహం

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (12:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో పెట్టి హంతకులు పరారయ్యారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజా మోహన్‌గా గుర్తించారు.  
 
మరోవైపు, వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటనపై ఉన్న మిస్టరీ వీడిపోయింది. డబ్బు, బంగారం కోసమే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. హంతకుడు ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన జక్కుల శ్రీను అనే యూట్యూబ్ జర్నలిస్టుగా గుర్తించారు. 
 
మృతుడుకి మద్యం తాగించి రోకలి బండతో కొట్టి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య దగ్గర పీఏగా పని చేసిన నిందితుడు శ్రీను గతంలో కూడా పలువురిని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments