Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (15:24 IST)
దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది. సామూహిక అత్యాచారం చేస్తున్న సమయంలో బాధితురాలు గొంతు తడారిపోయి దాహం దాహం అంటూ కేకలు వేయడంతో కామాంధులు కనికరించకపోగా ఆమె నోట్లో మూత్రం పోసినట్లు తేలింది. ఈ దారుణ ఘటనకు పాల్పడ్డవారిలో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో వున్నారు.
 
ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. ఆ రాత్రికి అక్కడే నిద్రించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ యువతి ఒంటరిగా కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతానికి వెళ్లగా అక్కడ మాటువేసివున్న కొందరు యువకులు ఆమెను అటకాయించారు. 
 
ఆ తర్వాత ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేసి, ఆ యువతిని మాత్రం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments