Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయిన 11 నెలల బాలుడు

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (15:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 11 నెలల బాలుడు నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కథన వివరాలను పరిశీలిస్తే, రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కల దేవీ లక్ష్మణ్, గీత దంపతులు కట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
సోమవారం సాయంత్రం దంపతులిద్దరు కుట్టుపనిలో నిమగ్నం కాగా, వారి చిన్న కుమారుడు హేమంత్ (11నెలలు) అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో హేమంత్ పక్కనే ఉన్న నీటి బకెట్ వద్దకు వెళ్లి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. అప్పటివరకు అక్కడే ఆడుకుంటున్న తమ కుమారుడు కనిపించకపోవడంతో తల్లి కంగారు పడుతూ వెతకడం మొదలు పెట్టింది. 
 
ఈ క్రమంలో నీటి బకెట్లో పడి శ్వాస తీసుకోలేక విలవిలలాడుతుండడాన్ని తల్లి చూసింది. దీంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అప్పటివరకు తల్లిదండ్రుల ముందే సరదాగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఇక లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments