Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుదుటున కుంకుమ బొట్లు పెట్టుకుని దేవుడి పటాలు బోర్లించి టెక్కీ కుటుంబం సూసైడ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (22:03 IST)
చక్కటి కుటుంబం, ఆర్థికంగా ఇబ్బందులేమీ లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదేళ్లక్రితం పెద్దలు అనుమతి తీసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా వుంది. కానీ ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదులోని అమీన్‌పూర్ వందనపురి కాలనీలో 42 ఏళ్ల శ్రీకాంత్ గౌడ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి 40 ఏళ్ల భార్య అనామిక కూడా ఓ కార్పొరేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఐతే రెండు రోజులుగా వీరు బయట కనిపించలేదు.

 
మరోవైపు అనామిక తండ్రి ఫోన్ చేసినా స్పందన లేదు. దీనితో అనుమానం వచ్చిన అనామిక తండ్రి నేరుగా వారి ఇంటికి వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియపెట్టి వుంది. దీనితో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అనామిక, ఆమె కుమార్తె ఇద్దరూ మంచంపై పడి నురగలు కక్కి మరణించి వున్నారు. 

 
శ్రీకాంత్ గౌడ్ తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాలను పరిశీలించగా వారి నుదుటున కుంకుమ బొట్లు పెట్టుకుని వున్నారు. దేవుడి పటాలను బోర్లించి పెట్టారు. దీనితో వారి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments