Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

వరుణ్
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:57 IST)
కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ట్రిపుల్ ఐటీలో ప్రకాశం జిల్లా కంభం మండలం, జంగుంట్ల గ్రామానికి చెందిన కుర్రి రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది.
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది సాయంతో ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, చివరి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా పూర్తికావడంతో మరో పది రోజుల్లో ఇంటికి వెళ్లాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, హాటల్ వార్డెన్ షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే, మృతురాలి మొబైల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments