Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

వరుణ్
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:57 IST)
కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ట్రిపుల్ ఐటీలో ప్రకాశం జిల్లా కంభం మండలం, జంగుంట్ల గ్రామానికి చెందిన కుర్రి రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది.
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది సాయంతో ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, చివరి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా పూర్తికావడంతో మరో పది రోజుల్లో ఇంటికి వెళ్లాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, హాటల్ వార్డెన్ షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే, మృతురాలి మొబైల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments