కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

ఠాగూర్
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (22:41 IST)
ఏపీలోని జిల్లా కేంద్రమైన కర్నూలులో ఒకే రోజు రెండు హత్యలు జరిగాయి. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. పట్టణంలో ఒకే రోజు రెండు హత్యలు చోటుచేసుకోవడం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని రాధాకృష్ణ టాకీస్ వద్ద స్థానిక బంగారు షాపు యజమాని హీజార్‌పై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరోవైపు, సాయి వైభవ్ నగర్‌‍లో 70 యేళ్ల వృద్ధురాలు శివలీలను దోపిడీ దొంగలు హత్య చేశారు. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండగా, తలపై బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు, గొలుసు కనపడటం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పట్టణంలో ఒకే రోజు రెండు హత్యలు జరగడంతో నగర ప్రజలు భయాందోళనకు గరవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments