Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ఎకరాల భూ వివాదం.. ఆరుగురిని గొడ్డలితో నరికేసిన మాజీ సైనికుడు..

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (09:34 IST)
రెండు ఎకరాల భూ వివాదం ఆరుగురు కుటుంబ సభ్యుల హత్యకు దారితీసింది. ఓ మాజీ సైనికుడు ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను గొడ్డలితో నరికివేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మాజీ సైనికుడు రెండెకరాల భూవివాదంలో తన కుటుంబంలోని ఆరుగురి సభ్యులను కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి సరూపి దేవి (65), అన్న హరీశ్ కుమార్ (35), వదిన సోనియా (32), ముగ్గురు చిన్నారులు.. పరి (7), యషిక (5) మయాంక్ (6నెలలు) ఉన్నారు. వారంతా నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో ఈ దారుణానికి భూషణ్ కుమార్ పాల్పడ్డాడు. 
 
అన్న, వదినను నరికిన తర్వాత వారి ముగ్గురు పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. అనంతరం మృతదేహాలను తగలబెట్టే ప్రయత్నం చేశాడు. తండ్రి ఓం ప్రకాశ్ అడ్డుకోవడంతో ఆయనపైనా దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి అంబాలా జిల్లా రతోర్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments