Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటుక బట్టీ వద్ద కాలిన బాలిక శవం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (17:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ బాలిక కాలిన శవం వెలుగు చూసింది. ఇంటి నుంచి అదృశ్యమైన కొన్ని గంటల్లోనే ఆ బాలిక మృత్యువాతపడటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, బుధవారం భిల్వారా గ్రామానికి మృతురాలు తన తల్లితో కలిసి మేకలు మేపుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ఆ బాలిక తల్లికి కనిపించకుండా పోయింది. ఎంతసేపటికి ఇంటికి తిరిగిరాలేదు. 
 
దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె కోసం రాత్రంతా గాలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె ఇంటికి సమీపంలోని ఇటుక బట్టీ వద్ద పోలీసులు కాలుతున్న దేహాన్ని, వెండిపట్టీ, చెప్పులను గుర్తించారు. వాటి ఆధారంగా ఆ మృతదేహం బాలికదే అని భావిస్తున్నారు.
 
హత్యకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలోని ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, ఐడీ, జనన ధ్రువీకరణ పత్రం అడిగారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments