Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో సైకో కిల్లర్: భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నదనీ...

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (21:29 IST)
ఇటీవల విశాఖ పెందుర్తిలో చోటుచేసుకున్న వరుస హత్యలు కలకలం సృష్టించాయి. ప్రజలు హడలిపోయారు. హతులంతా ఎక్కువగా స్త్రీలు కావడంతో పాటు ఇనుప రాడ్డుతో హత్యలు చేసాడు నిందితుడు. ఈ నరరూప రాక్షసుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
ఈ నేపధ్యంలో హంతకుడి గురించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడికి 2018లో ఆ షాకింగ్ ఘటన ఎదురైంది. అతడి భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని కళ్లారా చూసాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చాడు. పిల్లల్ని చూసేందుకు వారు ససేమిరా అనడంతో ఒంటరిగా మిగిలాడు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు. అక్కడ మోసపోయాడు. ఏం చేయాలో దిక్కుతోచక పొట్టకూటి కోసం ఆటో డ్రైవరుగా మారాడు. విశాఖలో ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. ఐతే తన భార్య మోసం చేసినందుకు మహిళలపై కక్ష పెంచుకున్నాడు.

 
ఒంటరిగా వున్న మహిళలపై దాడి చేసి హత్య చేసేవాడు. ఈ క్రమంలో ఆగస్టు 6న అర్థరాత్రివేళ చినముషిడివాడ సప్తగిరినగర్లో ఓ భవన నిర్మాణం వద్ద కాపలాదారులుగా వున్న దంపతులను దారుణంగా హత్య చేసాడు. హత్య చేసాక మరణించినవారిలో మహిళ వున్నదా లేదా అని తెలుసుకునేందుకు వారి ప్రైవేట్ పార్ట్స్ చూసేవాడు. మహిళే అని తెలుసుకున్న తర్వాత శవాన్ని కాలితో తన్ని అక్కడి నుంచి పరారయ్యాడు.

 
సరిగ్గా వారం తర్వాత... ఆగస్టు 14న సుజాతనగర్ లోని నాగమల్లి లేఅవుట్లో నిర్మాణంలో వున్న అపార్టుమెంట్ ఎదురుగా వున్న రేకుల షెడ్డులో నిద్రిస్తున్న లక్ష్మి అనే మహిళపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేసాడు. నిందితుడు ఫోను ఉపయోగించకుండా తిరగుతుండటంతో అతడిని పట్టుకోవడంలో క్లిష్టతరమైందని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments