Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాలు.. ఆలి.. కన్నబిడ్డను చంపేసి.. ఆతడూ ఆయువు తీసుకున్నాడు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:25 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక కష్టాలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. కట్టుకున్న భార్య, కన్నబిడ్డను చంపేసిన వ్యక్తి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి తోయపుట్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తోయపుట్‌కు చెందిన లింగరాజు బిశోయ్ (27) స్థానికంగా మొబైల్ షాపును నడుపుతున్నాడు. ఈయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. కుటుంబ జీవనం కోసం అప్పులు చేయసాగాడు. ఈ అప్పులు కూడా పెరిగిపోయాయి. దీంతో దిక్కుతోచనిస్థితిలో ఏం చేయాలో తెలియలేదు. తాను మాత్రమే ఆత్మహత్య చేసుకుంటే భార్యా, కుమార్తె ఒంటరివారే పోతారని భావించారు. 
 
అందుకే ముందుగా భార్య జ్యోత్స్న (24) మెడకు మొబైల్ చార్జర్ వైరు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ళ కుమార్తె గొంతుకు తాడు చుట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరుసటి రోజు వారి కదలికలు లేకపోవడంతో పొరుగింటివారు రాత్రి 9 గంటల సమయంలో వెళ్లి తలుపు తట్టారు. 
 
అయినప్పటికీ ఎలాంటి శబ్ధం లేకపోవడంతో గ్రామంలోని వారందరూ కలిసి తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఇంట్లో విగతజీవులై కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారమ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments