Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (14:55 IST)
భార్యా బాధితులు ఎక్కువగా కర్నాటక రాష్ట్రంలోనే వున్నట్లుగా వరుసగా ఆ రాష్ట్రంలో భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరో విషాదకర సంఘటన జరిగింది. తన భార్య పింకీ వేధిస్తోందనీ, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె భర్త సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
ఈ విషాదకర పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని హుబ్బళ్లికి చెందిన పీటర్ తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమనీ, తన తల్లిదండ్రులు తను ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించమని వేడుకున్నాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు మాట్లాడుతూ... పీటర్, పింకీలకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవలే ఏదో విషయమై వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో గత 3 నెలలుగా ఇద్దరూ విడిగా వుంటున్నారు. పింకీ కారణంగా తన సోదరుడి ఉద్యోగం కూడా పోయింది.
 
పింకీ తనకు భరణంగా 20 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేయడంతో పీటర్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ బోరుమంటూ విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పీటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పింకీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments