Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (14:55 IST)
భార్యా బాధితులు ఎక్కువగా కర్నాటక రాష్ట్రంలోనే వున్నట్లుగా వరుసగా ఆ రాష్ట్రంలో భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరో విషాదకర సంఘటన జరిగింది. తన భార్య పింకీ వేధిస్తోందనీ, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె భర్త సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
ఈ విషాదకర పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని హుబ్బళ్లికి చెందిన పీటర్ తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమనీ, తన తల్లిదండ్రులు తను ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించమని వేడుకున్నాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు మాట్లాడుతూ... పీటర్, పింకీలకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవలే ఏదో విషయమై వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో గత 3 నెలలుగా ఇద్దరూ విడిగా వుంటున్నారు. పింకీ కారణంగా తన సోదరుడి ఉద్యోగం కూడా పోయింది.
 
పింకీ తనకు భరణంగా 20 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేయడంతో పీటర్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ బోరుమంటూ విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పీటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పింకీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments