Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆత్మహత్యకు నా భర్తే కారణం... గోడపై రాసి ప్రాణాలు తీసుకుంది...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (15:31 IST)
నా చావుకు నా భర్తే కారణం అంటూ గోడపై రాసిమరీ ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గణాలోని ఫతేగఢ్‌కు చెందిన 42 యేళ్ల ఉమ అలియాస్ జ్యోతి అగర్వాల్‌కు ఫతేనగర్‌కు పురుగుల మందు వ్యాపారి దీపక్ అగర్వాల్ అనే వ్యక్తితో 11 నెలల క్రితం వివాహమైంది. కొంతకాలంపాటు వీరి సంసారం సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో దీపక్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఆరంభమయ్యాయి. మరోవైపు, దీపక్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆత్మహత్య చేసుకునేముందు తనపై జరిగిన చిత్ర హింసల గురించి గోడలపై రాసింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, కోటాలో నివసిస్తున్న ఓ మహిళ తన సంసారంలో నిప్పులు పోసిందని, తన చావుకు భర్తే కారణమని ఆమె గోడపై రాసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments