Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా కాల్చొద్దన్న యువకుడు.. కత్తితో పొడిచి చంపిన మైనర్లు...

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (09:57 IST)
ముంబై నగరంలో దీపావళి పండుగ రోజున ఓ దారుణం జరిగింది. టపాసులు పేల్చొద్దని చెప్పినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ యువకుడిని కొందరు మైనర్లు కలిసి కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై శివాజీ నగర్‌కు చెందిన 12 యేళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. దీన్ని గమనించిన పొరుగింటి యువకుడు సునీల్ శంకర్ నాయుడు (21) అలా కాల్చొద్దని వారించాడు. పైగా, అది చాలా ప్రమాదమని, గ్లాసు పేలి దాని ముక్కలు అందరికీ గుచ్చుకుంటాయని, అందువల్ల అలా కాల్చొద్దని వారించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఈ గొడవను చూసిన బాలుడు అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చాడు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవపడ్డారు. ఆ తర్వాత ఆగ్రహంతో వారంతా కలిసి శంకర్‌పై దాడిచేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ బాలుడు అన్న, అతడి స్నేహితుడుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు కారణమైన మైనర్ బాలుడు మాత్రం పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments