Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు బిడ్డలను నీటి బకెట్‌లో చంపేసిన తల్లి.. ఎక్కడ.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (10:41 IST)
ఓ కషాయి తల్లి తన ఇద్దరు పిల్లలను నీటి బకెట్‌లో ముంచి చంపేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వీలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హాల్వి గ్రామానికి చెందిన రామకృష్ణ, శారద దంపతులకు ఇద్దరు కుమారులు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో శారద తన ఇద్దరు కుమారులు వెంకటేశ్ (3), భరత్ (6 నెలలు)లను నీటి బకెట్‌లో ముంచింది. చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భర్తతో కలిసి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
చిన్నారుల మృతదేహాల్ని శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమారులను చంపినట్టు తెలిస్తే ఇంట్లోవారు తనను చంపేస్తారనే భయంతో శారద కూడా విషం సేవించింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను చంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసినట్టు  ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments