Webdunia - Bharat's app for daily news and videos

Install App

వద్దన్నా బయటకెళ్లిన భర్త.. కోపంతో భార్య ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (15:50 IST)
తాను చెప్పిన మాట వినకుండా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడన్న కోపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని గుంటూరు నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు పట్టణంలోని కళ్యాణి నగర్ ప్రాంతానికి చెందిన నాగూర్ బాషా, జ్యోత్స్న ఐదు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. 
 
వృత్తిలో భాగంగా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ, పెళ్లి వరకు దారితీసింది. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ వచ్చారు. అయితే, వారిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఇద్దరి జీవితాల్లో పెను విషాదం నింపించిద. బయటకు వెళ్లొద్దని చెప్పిన తన మాట భర్త వినకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. 
 
తన కుమార్తెతో మాట్లాడేందుకు జ్యోత్స్న తల్లి ఫోన్ చేయగా, ఆమె ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అల్లుడుకి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా భార్య ఫ్యానుకు ఉరేసుకునివుంది. దీంతో బోరున విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments